రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ నెలాఖరులోగా ఎన్నికలు పూర్తిచేయాలని హైకోర్టు ఆదేశాలు ఉండటంతో.. దీనిపై మరోసారి కోర్టును ఆశ్రయించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు బీసీలకు 42శాతం రిజర్వేషన్ల అంశం పెండింగ్లోనే ఉంది. దీంతో మరింత గడువు కోరనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో OCT చివరి నాటికి ఎన్నికలు నిర్వహించే యోచనలో ఉన్నట్టు సమాచారం.