నేడు చిలుకూరు బాలాజీ దేవాలయం మూసివేత

13చూసినవారు
నేడు చిలుకూరు బాలాజీ దేవాలయం మూసివేత
చంద్రగ్రహణం కారణంగా చిలుకూరు బాలాజీ దేవాలయం మూసివేయనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. మంగళవారం ఉదయం 7.30 గంటల వరకు స్వామివారి సేవలు ముగించి, గ్రహణం పూర్తయిన తర్వాత రాత్రి 7 గంటలకు సంప్రోక్షణతో ఆలయాన్ని శుద్ధి చేస్తారు. ఈ సమయంలో భక్తులకు దర్శనం ఉండదు. బుధవారం ఉదయం 6 గంటల నుంచి భక్తులు స్వామివారిని దర్శించుకోవచ్చు.