లక్డీకాపూల్ లో సోమవారం CID డీజీ చారు సిన్హా ఆన్లైన్ బెట్టింగ్ రాకెట్ పై వివరాలు వెల్లడించారు. ‘డఫాబెట్’ నిందితుల ఖాతాలకు దేశవ్యాప్తంగా 73 కేసులు, 225 ఫిర్యాదులతో సంబంధాలున్నట్లు NCRP ద్వారా గుర్తించినట్లు తెలిపారు. చర్యల్లో భాగంగా 414 బ్యాంక్ ఖాతాలను ఫ్రీజ్ చేసి, 108 వెబ్సైట్లను నిషేధించాలని MeitYకి సిఫార్సు చేసినట్లు చెప్పారు. సైబర్ మోసాలకు గురైతే 1930 హెల్ప్లైన్కు ఫిర్యాదు చేయాలని సూచించారు.