బీసీల జనాభా నిష్పత్తి ప్రకారం హక్కులు సాధించేందుకు త్వరలో దేశవ్యాప్తంగా ‘మేమెంతో మాకంత’ నినాదంతో మహోద్యమం చేపట్టనున్నట్లు జస్టిస్ బీ. ఈశ్వరయ్య తెలిపారు. గురువారం హైదరాబాద్లోని బీసీ కేంద్ర కార్యాలయంలో ఆయన ఆల్
ఇండియా బీసీ ఫెడరేషన్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా బీసీలకు జనాభా ప్రాతిపదికన సముచిత హక్కులు, అవకాశాలు కల్పించాలని ఆయన అన్నారు.