ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్.
రాజమౌళి తన కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్లోని AMB మాల్లో 'పెద్ది' సినిమాను వీక్షించారు. ఈ చిత్రానికి బుచ్చిబాబు సానా దర్శకత్వం వహించగా, రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ నటించారు. ఏ.ఆర్. రెహమాన్ సంగీతం అందించిన ఈ ప్రత్యేక ప్రదర్శనకు రాజమౌళితో పాటు, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కూడా హాజరయ్యారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.