లంగర్హౌస్ అంబేద్కర్ విగ్రహం సమీపంలో ప్రధాన వాటర్ పైప్లైన్ పగలడంతో నిన్న రాత్రి నుండి తాగునీరు రోడ్లపైకి ప్రవహిస్తోంది. దీనివల్ల రహదారులు జలమయమై వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఎండాకాలంలో నీటి ఎద్దడి ఉన్నా, అధికారులు స్పందించకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వెంటనే మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.