భారత్లో నివసిస్తున్న పాకిస్థాన్ జాతీయులు తప్పనిసరిగా చట్టప్రకారం దీర్ఘకాలిక వీసా పొందాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ వీసా లేనివారిపై చర్యలు తీసుకోవచ్చని, పోలీసు తనిఖీలను ఆపలేమని పేర్కొంది. గతేడాది జూన్ 4న కేంద్రం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం, ప్రస్తుతం దీర్ఘకాలిక వీసాతో ఉంటున్న పాక్ జాతీయులు మళ్లీ ఆ వీసా కోసం దరఖాస్తు చేసుకోవాలి.