భారత వాయుసేనకు చెందిన సూర్యకిరణ్ ఏరోబాటిక్ బృందం ప్రదర్శనతో బేగంపేట విమానాశ్రయంలో నిర్వహించిన వింగ్స్ ఇండియా-2026 విమానయాన ప్రదర్శన శనివారంతో ముగియనుంది. ఈ ప్రదర్శనను తిలకించడానికి సందర్శకులు అధిక సంఖ్యలో తరలిరావడంతో బేగంపేటలో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ట్రాఫిక్ను పునరుద్ధరించడానికి పోలీసులు చర్యలు చేపట్టారు.