ప్రముఖ టీవీ ప్రజెంటర్, రచయిత్రి మనీషా ఉపాధ్యాయ్ మంగళవారం హైదరాబాద్ సోమాజిగూడలోని లోక్ భవన్లో తెలంగాణ గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్ల ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తాను రచించిన The Art of Politics పుస్తకాన్ని గవర్నర్కు బహుకరించారు. పుస్తకంలోని అంశాలతో పాటు ప్రస్తుత రాజకీయ పరిణామాలపై తన విశ్లేషణలను గవర్నర్తో పంచుకున్నారు.