పాస్ పోర్ట్ దరఖాస్తుల ధ్రువీకరణలో అత్యుత్తమ సేవలు అందించినందుకు రాష్ట్ర పోలీసు శాఖకు కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతిష్టాత్మక ఇన్స్టిట్యూషనల్ పార్మమెన్ అవార్డు ప్రకటించింది. జనవరి 19న దిల్లీలో జరిగే పాస్ పోర్ట్ సేవా దివాస్ కార్యక్రమంలో విదేశాంగ మంత్రి జైశంకర్ చేతుల మీదుగా డీజీపీ సివి ఆనంద్ ఈ అవార్డును అందుకోనున్నారు. సాంకేతిక ఆధారిత విధానాల ద్వారానే ఈ గుర్తింపు లభించిందని డీజీపీ పేర్కొన్నారు.