కూకట్పల్లి నియోజకవర్గంలోని శాతవాహన పబ్లిక్ స్కూల్, జీహెచ్ఎంసీ ఓటీఎస్ పథకం కింద రూ. 32,42,975 ఆస్తిపన్ను బకాయిని చెల్లించింది. హెచ్ఎంటీ శాతవాహన నగర్ కోఆపరేటివ్ సొసైటీ ప్రతినిధులు ఈ మొత్తానికి సంబంధించిన చెక్కును అల్విన్ కాలనీ సర్కిల్-51 డీసీ చాముండేశ్వరికి అందజేశారు. వడ్డీ రాయితీతో ఓటీఎస్ను వినియోగించుకుని బకాయిలను ఒకేసారి చెల్లించినట్లు అధికారులు తెలిపారు.