కూకట్పల్లి నియోజకవర్గం ఫతేనగర్లోని శ్రీ కన్యకా పరమేశ్వరి దేవాలయంలో వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. మాజీ కార్పొరేటర్ పండాల సతీష్ గౌడ్ ప్రత్యేక పూజలు చేసి, వాసవి మాత చూపిన సత్యం, ధర్మం, అహింస మార్గంలో నడవాలని భక్తులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. వీరేశం గుప్తా ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ జరిగింది.