సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి అనుమానాస్పద స్థితిలో మృతి

5చూసినవారు
సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి అనుమానాస్పద స్థితిలో మృతి
అబ్దుల్లాపూర్‌మెట్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో మంగళవారం ఒక సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్ కారులో శవమై కనిపించాడు. మృతుడు ఎన్‌టీఆర్‌ జిల్లా విజయవాడకు చెందిన శివరామకృష్ణ (33), గచ్చిబౌలిలోని ఇన్ఫోసిస్‌లో పనిచేస్తున్నాడు. సోమవారం ఉదయం కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి ఇంటికి వస్తున్నట్లు చెప్పాడు. మంగళవారం ఉదయం అవుటర్‌ రింగ్‌ రోడ్డులో నిలిపిన కారులో అపస్మారక స్థితిలో ఉన్న యువకుడిని పెట్రోలింగ్‌ సిబ్బంది గుర్తించారు. అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. అమెరికా నుంచి ఎప్పుడు వచ్చాడు, మృతికి కారణమేంటనేది పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. శివరామకృష్ణకు వివాహం చేయాలనుకుంటున్న సమయంలో ఈ విషాదం చోటుచేసుకుంది.

సంబంధిత పోస్ట్