ఏసీబీకి పట్టుబడ్డ పంచాయతీ కార్యదర్శి

116చూసినవారు
ఏసీబీకి పట్టుబడ్డ పంచాయతీ కార్యదర్శి
రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం వెల్జాల్ పంచాయతీ కార్యదర్శి శరత్, గ్రామంలో ఒక ప్లాట్ సమస్యను పరిష్కరించడానికి రూ. 30,000 డిమాండ్ చేశాడు. బాధితుడు రూ. 20,000 ఇవ్వడానికి అంగీకరించాడు. ఈ విషయాన్ని బాధితుడు రంగారెడ్డి ఏసీబీ డీఎస్పీ ఆనంద్‌కు తెలియజేశాడు. ప్రణాళిక ప్రకారం, బాధితుడు పంచాయతీ కార్యదర్శి శరత్‌కు రూ. 20,000 ఇస్తుండగా, ఏసీబీ అధికారులు అతన్ని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. పంచాయతీ కార్యదర్శి శరత్‌ను అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు.

సంబంధిత పోస్ట్