శాస్త్రవేత్తల ఆలోచనలు ప్రజలకు చేరాలి: ధర్మేంద్ర ప్రధాన్

3చూసినవారు
శాస్త్రవేత్తల ఆలోచనలు ప్రజలకు చేరాలి: ధర్మేంద్ర ప్రధాన్
కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఐఐటి మద్రాస్ టెక్నాలజీ సమ్మిట్‌లో మాట్లాడుతూ, భారత్ ఇన్నోవేట్స్ కార్యక్రమం ద్వారా శాస్త్రవేత్తల పరిశోధనలను ప్రజలకు ఉపయోగపడే ఉత్పత్తులుగా మార్చడమే లక్ష్యమని తెలిపారు. ఆవిష్కరణలు ల్యాబ్ నుండి మార్కెట్లోకి వచ్చి, సామాన్య మానవుడి దైనందిన సమస్యలను పరిష్కరించాలని, మన టెక్నాలజీ ప్రపంచానికి ఉపయోగపడేలా ఉండాలని ఆయన అన్నారు. 2047 నాటికి భారత్ ప్రపంచానికి మార్గదర్శిగా నిలుస్తుందని, నవ భారత్ నిర్మాణం అంటే వినూత్న ఆలోచనలతో కూడిన బలమైన వ్యవస్థను నిర్మించడమేనని ఆయన అభిప్రాయపడ్డారు.

సంబంధిత పోస్ట్