రాజేంద్రనగర్ నియోజకవర్గ స్థాయి సీఎం కప్ క్రీడా టోర్నమెంట్ ZPHS శివరాంపల్లి పాఠశాల మైదానంలో జరగనుంది. రాజేంద్రనగర్, గండిపేట్, శంషాబాద్ మండలాల విద్యార్థులు ఆన్లైన్లో నమోదు చేసుకుంటేనే పాల్గొనవచ్చు. ఫిబ్రవరి 7, 2026న తాలుకా స్థాయి టోర్నమెంట్, ఎంపికలు ఉంటాయి. పాల్గొనేవారు ఆధార్ కార్డుతో ఉదయం 9 గంటలకు హాజరుకావాలని జోనల్ ఇన్చార్జ్ కె.గాంగ్య నాయక్ సూచించారు.