హైదరాబాద్లో జూన్ 2న
జనసేన నిర్వహించనున్న ‘తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభ’పై TRS అధ్యక్షురాలు కవిత స్పందించారు. తమ మేధావులను ఆంధ్రా పోలీసులతో బెదిరిస్తే ఊరుకోమని, రాజకీయ దమ్ముంటే నేరుగా ఎదుర్కోవాలని ఆమె సవాల్ విసిరారు. సొంత రాజధాని కట్టుకోవడం చేతకాని వాళ్ళు ఇక్కడ పంచాయితీలు పెడితే ఈసారి పళ్ళు రాలడం ఖాయమని కవిత హెచ్చరించారు.