మలక్ పేట్ లో కరెంట్ షాక్ తగిలి లిఫ్ట్ టెక్నిషియన్ మృతి.

0చూసినవారు
హైదరాబాద్‌లోని మలక్‌పేటలో లిఫ్ట్ ఏర్పాటు పనులు చేస్తుండగా, 42 ఏళ్ల లిఫ్ట్ టెక్నీషియన్ సుశీల్ జాడే కరెంట్ షాక్‌తో మృతి చెందాడు. అల్వాల్ నివాసి అయిన మృతుడు, గద్వాల్ జిల్లాకు చెందినవాడు. చాదర్‌ఘాట్ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి గల పూర్తి కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్