తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం విచిత్రంగా మారింది. తెలంగాణలో తీవ్రమైన ఎండలు, వడగాలులు కొనసాగుతుండగా, ఆంధ్రప్రదేశ్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. కేరళ తీరానికి రుతుపవనాల రాక ఆలస్యమయ్యే సూచనలున్నాయి. జూన్లోనూ ఎండలు, వడగాలులు కొనసాగవచ్చని, అయితే కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా. ఉత్తర తెలంగాణలో మాత్రం వర్షాభావ పరిస్థితులు ఉండొచ్చని భావిస్తున్నారు. రాబోయే 3-4 రోజుల్లో రుతుపవనాలు మరిన్ని ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉంది. ఆదివారం నుంచి మూడు రోజుల పాటు తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు రాబోయే నాలుగు రోజుల్లో రెండు నుంచి నాలుగు డిగ్రీలు తగ్గే అవకాశం ఉంది.