తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2025-26 విద్యా సంవత్సరానికి ఇంటర్ పబ్లిక్ పరీక్షలు వచ్చే ఏడాది మార్చి నెలలో ప్రారంభం కానున్నాయి. ఇంటర్ బోర్డు విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం, వార్షిక పరీక్షలు 2026 ఫిబ్రవరి 25 నుంచి మార్చి 17 వరకు జరుగనున్నాయి. ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 9.8 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. మంగళవారం నాటికి 9,79,506 మంది విద్యార్థులు ఫీజు చెల్లించినట్లు ఇంటర్ బోర్డు వెల్లడించింది.