మేడ్చల్ జిల్లా శామీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అద్రాస్పల్లి గ్రామంలో రామాలయంలో సీతారాముల కళ్యాణోత్సవం సందర్భంగా ఆలయ ప్రవేశంపై వివాదం చోటుచేసుకుంది. ముడుచింతలపల్లి మండలానికి చెందిన గ్యార మల్లేష్ సహా మరికొందరు కళ్యాణోత్సవానికి హాజరైనప్పుడు, ఆలయంలో ఉన్న కొందరు మహిళలు వారి ప్రవేశాన్ని అభ్యంతరం వ్యక్తం చేశారని బాధితులు తెలిపారు. దీనితో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగినట్లు సమాచారం. తమను అవమానించారని ఆరోపిస్తూ బాధితులు శామీర్పేట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.