తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో 42% బీసీ రిజర్వేషన్లను 9వ షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ శనివారం ఇందిరా పార్క్ వద్ద 24 గంటల నిరహార దీక్షను ప్రారంభించారు. ఈ దీక్షకు మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, మాజీ స్పీకర్ మధుసూదన చారి, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల లింగం గౌడ్, జస్టిస్ చంద్రకుమార్, గుజ్జ కృష్ణ తదితరులు మద్దతు తెలిపారు.