శుక్రవారం ఆర్టీసీ క్రాస్ రోడ్స్ జంక్షన్ సమీపంలోని అశోక్నగర్ వద్ద ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కారణంగా ఎల్టీ (లో టెన్షన్) విద్యుత్ తీగ రోడ్డుపై తెగిపడింది. సమాచారం అందిన వెంటనే అధికారులు స్పందించి, ప్రజల భద్రత కోసం ఆ మార్గంలో వాహనాల రాకపోకలను నిలిపివేశారు. ప్రమాదాలను నివారించడానికి ట్రాఫిక్ను ప్రత్యామ్నాయ మార్గాలకు మళ్లించారు. వాహనదారులు సహకరించాలని అధికారులు కోరారు.