ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ ఇచ్చిన నోటీసులపై బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ వివరణ ఇచ్చారు. మున్సిపల్ ఎన్నికల నామినేషన్లకు రేపే చివరి తేదీ కావడంతో తాను విచారణకు హాజరుకాలేనని తెలిపారు. తనను ఎర్రవల్లిలోనే విచారణ చేయాలని ఆయన కోరారు. మాజీ సీఎంగా, ప్రతిపక్ష నేతగా విచారణకు పూర్తిగా సహకరిస్తానని కేసీఆర్ హామీ ఇచ్చారు.