మాజీ ప్రధాని పీవీ నరసింహారావు జయంతి సందర్భంగా ఆదివారం హైదరాబాద్లోని తెలంగాణ శాసనసభ భవనం లాబీ హాల్లో ఆయన చిత్రపటానికి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మండలి చైర్మన్ గుత్త సుఖేందర్ రెడ్డి, డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్, ఎమ్మెల్సీ సురభి వాని దేవి సహా పలువురు ప్రముఖులు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పీవీ దేశానికి చేసిన సేవలను వారు స్మరించుకున్నారు.