కుత్బుల్లాపూర్ తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు

2చూసినవారు
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం ACB అధికారులు దాడులు నిర్వహించారు. ఫ్యామిలీ సర్టిఫికెట్ జారీ చేసేందుకు లంచం డిమాండ్ చేసిన జూనియర్ అసిస్టెంట్ గణేష్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఫిర్యాదుదారుడి ప్రకారం, గణేష్ మొదట 30,000 రూపాయలు డిమాండ్ చేయగా, తర్వాత 15,000 రూపాయలకు ఒప్పందం కుదిరింది. బాధితుడు ACB అధికారులను ఆశ్రయించడంతో, వారు పక్కా ప్రణాళికతో ట్రాప్ నిర్వహించి, కార్యాలయంలోనే 15,000 రూపాయలు స్వీకరిస్తున్న సమయంలో గణేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. లంచంగా తీసుకున్న నగదును స్వాధీనం చేసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్