కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జోనల్ కార్యాలయంలో శనివారం ఎస్. ఐ. ఆర్. -2026 సమస్యలపై ఆల్ పార్టీ సమావేశం జరిగింది.
బీఆర్ఎస్ పార్టీ నాయకులు జోనల్ కమిషనర్ పింకేష్ కుమార్ను కలిసి, ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో సత్యనారాయణ, రాజ్కుమార్, బైరిష్ గౌడ్, వేణు ముదిరాజ్, కిషోర్ ముదిరాజ్, అనిల్, గణేష్తో పాటు వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.