సాయి నగర్‌లో మంచినీటి సమస్యపై ఆగ్రహం

2చూసినవారు
సాయి నగర్‌లో మంచినీటి సమస్యపై ఆగ్రహం
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, నిజాంపేట్ సర్కిల్ బాచుపల్లి గ్రామం సాయి నగర్‌లో గత పది రోజులుగా సంపు మోటార్ మరమ్మతులు చేయకపోవడంతో కాలనీకి మంచినీటి సరఫరా నిలిచిపోయింది. ప్రజల ఫిర్యాదుతో అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన నిర్వహించి, జీఎం, సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరారు. సమస్య పరిష్కారం కాకపోతే ఆదివారం వాటర్ వర్క్స్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.

ట్యాగ్స్ :