కడప జిల్లా సుండుపల్లికి చెందిన ప్రముఖ మేజిషియన్ గంగారపు నాగార్జున శుక్రవారం హైదరాబాదులో అనారోగ్యంతో మృతి చెందారు. కొద్ది నెలలుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఉదయం తుదిశ్వాస విడిచారు. గాంధీ ఆసుపత్రిలో పంచనామా అనంతరం మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించారు. మేజిషియన్ అలీ, సుడిగాలి సుధీర్ తో పాటు పలువురు మేజిషియన్లు ఆయన మృతి పట్ల సంతాపం ప్రకటించారు.