ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని షాపూర్ నగర్లో పుప్పాల ఫౌండేషన్ ఆధ్వర్యంలో మల్లారెడ్డి నర్సింగ్ ఇన్స్టిట్యూషన్స్ సహకారంతో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కేపీ వివేకానంద పాల్గొని, ప్రజల ఆరోగ్య పరిరక్షణలో ఇలాంటి సేవా కార్యక్రమాల ఆవశ్యకతను నొక్కి చెప్పారు. స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై వైద్య సేవలు పొందారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.