కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, జగద్గిరిగుట్ట డివిజన్ కూన మహాలక్ష్మి నగర్లో సీసీ రోడ్లు, యూజీడీ సమస్యలపై మాజీ కార్పొరేటర్ కొలుకుల
జగన్ మంగళవారం పాదయాత్ర నిర్వహించారు. స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకుని, త్వరలోనే పనులు పూర్తి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మహంకాళి వెంకటేష్, ఎర్ర లక్ష్మయ్య, దుర్గయ్య, నరసింహ, దుర్గేష్ తదితరులు పాల్గొన్నారు.