కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పేట్బషీరాబాద్ పరిధిలోని ధండమూడి ఎన్క్లేవ్ కాలనీ నూతన సంక్షేమ సంఘం కమిటీ సభ్యులు ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతన కమిటీకి ఎమ్మెల్యే అభినందనలు తెలియజేస్తూ, కాలనీ అభివృద్ధికి తన పూర్తి సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. మౌలిక సదుపాయాల కల్పనతో పాటు అభివృద్ధి కార్యక్రమాల అమలుకు కృషి చేస్తామని తెలిపారు.