ప్రగతి నగర్లోని స్మశానవాటిక ప్రవేశద్వారం వద్ద కొత్త గేటు నిర్మాణ కార్యక్రమం ఘనంగా పూర్తయింది. 22వ డివిజన్ కార్పొరేటర్ అళేటి శ్రీనివాసరావు ఈ కార్యక్రమానికి స్పాన్సర్గా వ్యవహరించారు. వైకుంఠ ధామం కమిటీ సభ్యులు, సీనియర్ సిటిజన్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కొత్త గేటుతో ప్రవేశద్వారం వద్ద భద్రత పెరుగుతుందని, ఇది ప్రగతి నగర్ అభివృద్ధికి మంచి ముందడుగు అని కమిటీ సభ్యులు, ప్రజలు అభిప్రాయపడ్డారు.