కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, జీడిమెట్ల డివిజన్ పరిధిలోని "సన్మాన్ ట్రినిటీ విల్లాస్" సంక్షేమ సంఘం సభ్యులు మంగళవారం పేట్ బషీరాబాద్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే కెపి వివేకానంద్ ను మర్యాదపూర్వకంగా కలిసి, కాలనీలోని భూగర్భ డ్రైనేజ్, రోడ్డు సమస్యలపై విన్నవించారు. ఎమ్మెల్యే సానుకూలంగా స్పందిస్తూ, పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా కొత్త కాలనీలలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నామని తెలిపారు.