సౌదీ అరేబియాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో ప్రాణాపాయం నుంచి బయటపడిన 24 ఏళ్ల మొహమ్మద్ అబ్దుల్ సోహెబ్ చికిత్స అనంతరం హైదరాబాద్ చేరుకున్నాడు. నటరాజ్ నగర్లోని తన ఇంటికి చేరుకున్న అతన్ని బంధువులు, మిత్రులు, స్థానికులు కలిసి పరామర్శించారు. ఈ ప్రమాదంలో 45 మంది మరణించిన విషయం తెలిసిందే. తనను సురక్షితంగా భారత్కు తిరిగి తీసుకురావడంలో సహకరించిన ప్రతి ఒక్కరికీ సోహెబ్ కృతజ్ఞతలు తెలిపారు.