తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరోసారి స్పోర్ట్స్ మ్యాన్ అవతారమెత్తారు. MLAలు, MLCల స్పోర్ట్స్ మీట్ ప్రారంభోత్సవం సందర్భంగా ఎల్బీ స్టేడియంలో ఆయన ఫుట్బాల్ మ్యాచ్ ఆడారు. పలువురు MLAలు, విద్యార్థులతో సరదాగా ఆడి సందడి చేశారు. ఈ క్రమంలో తన టీమ్ తరఫున ఆయన 4 గోల్స్ సాదించారు. దీంతో సహచర ప్లేయర్లు ఆయనను భుజాలపై ఎత్తుకొని అభినందించారు. ఈ మ్యాచులో CM టీమ్ గెలిచింది. ఇక్కడ 2 రోజుల పాటు ప్రజాప్రతినిధుల ఆటలపోటీలు జరగనున్నాయి.