అనాథ పిల్లలకు సహాయం చేయడంలో ప్రతి ఒక్కరూ మానవతా దృక్పథంతో స్పందించాలని పలువురు వక్తలు పేర్కొన్నారు. బన్సిలాల్ పేట, కృష్ణా నగర్ కాలనీలో ఆక్సిలియం నవజీవన అనాథ బాలికల ఆశ్రమంలో చిలకలగూడకు చెందిన ప్రభాకర్ రామగిరి చిన్నారి బాలికలకు శనివారం దుప్పట్లు, జ్యూస్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. చిన్నారుల అవసరాల మేరకు భవిష్యత్తులో మరింత సహాయం చేస్తానని ప్రభాకర్ పేర్కొన్నారు.