భారత్లో కమ్యూనిస్టుల రాజకీయ ప్రాధాన్యత, భవిష్యత్తుపై సీపీఐ నాయకుడు కూనంనేని సాంబశివరావు టీవీ9 క్రాస్ ఫైర్ ఇంటర్వ్యూలో మాట్లాడారు. దేశంలో కమ్యూనిస్టులకు కాలం చెల్లిపోయిందనే వాదనను ఆయన ఖండించారు. ఒకప్పుడు దేశవ్యాప్తంగా కమ్యూనిస్టు ఉద్యమాలు బలంగా ఉండేవని, ప్రస్తుతం కేరళలో సీపీఐ బలమైన శక్తిగా ఉందని, బెంగాల్, త్రిపురలలో పట్టు కోల్పోయినా కేరళలో ప్రాధాన్యత తగ్గలేదని స్పష్టం చేశారు. తెలుగు రాష్ట్రాల్లో శాసనసభల్లో ప్రాతినిధ్యం తగ్గడానికి ప్రజల్లో విశ్వాసం తగ్గడం కాదని, ఇతర పార్టీల అవకాశవాదమే కారణమని విమర్శించారు. కమ్యూనిస్టులను ఉద్యమకారులుగా చూస్తున్నారని, శాసనసభల్లో ప్రతినిధులుగా చూడటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో
ఎన్టీఆర్ హయాంలో, తెలంగాణలో
కేసీఆర్ మొదట్లో కమ్యూనిస్టులకు గౌరవం లభించిందని, కానీ ఎన్నికల సమయంలో బలహీనపరిచారని ఆరోపించారు.
కాంగ్రెస్ పార్టీ కూడా అధికారంలోకి రావడానికి కమ్యూనిస్టుల మద్దతు కోరి, పొత్తుల్లో తక్కువ సీట్లు ఇచ్చిందని, మంత్రి పదవి ఆఫర్ చేసినా తిరస్కరించిందని తెలిపారు. శాసనసభల్లో తమ లేని లోటు కాంగ్రెస్కు త్వరలో అర్థమవుతుందని అభిప్రాయపడ్డారు.