సికింద్రాబాద్లోని అల్వాల్ ప్రాంతంలో ర్యాపిడో రైడర్ పొన్నకంటి కాశి, తన స్నేహితుడు పొన్నకంటి శేఖర్ను మద్యం తాగించి, హత్య చేసి, మృతదేహాన్ని పెట్రోల్తో కాల్చేసిన ఘటన కలకలం రేపింది. గతంలో ఇద్దరూ కలిసి ఒక దుకాణం నుండి రాగి తీగను దొంగిలించారు. ఈ విషయం బయటపడటంతో అవమానంగా భావించిన కాశి, శేఖర్ను హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. మార్చి 30న మద్యం మత్తులో ఉన్న శేఖర్ను గొంతు నులిమి హత్య చేసి, పెట్రోల్ పోసి తగలబెట్టినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో నిందితుడైన కాశిని పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు.