బోయిన్పల్లి అంబేడ్కర్ నగర్లో అంబులెన్స్కు దారి లేకపోవడంతో గుండె సంబంధ వ్యాధితో బాధపడుతున్న పోచయ్య(60) ప్రాణాలు కోల్పోయారు. రహదారిపై ఇరువైపులా వాహనాలు నిలిపివేయడంతో గంటసేపు అంబులెన్స్ అక్కడే చిక్కుకుపోయిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ ఘటనపై ఆగ్రహంతో స్థానికులు రోడ్డుపై ధర్నా చేయగా, తిరుమలగిరి పోలీసులు వారిని చెదరగొట్టి కేసు నమోదు చేశారు. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.