సరూర్నగర్లో జరిగిన భారీ పేలుడుతో బాధితురాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అకస్మాత్తుగా సంభవించిన ఈ పేలుడు వల్ల గోడలు, తలుపులు కూలిపోయాయని, మొదట
భూకంపం వచ్చిందేమోనని భయపడ్డానని తెలిపారు. ఇల్లంతా పొగ, దుమ్ముతో నిండిపోయిందని, సిలిండర్ పేలలేదని, అది సురక్షితంగానే ఉందని పేర్కొన్నారు. ఫ్రిజ్, అల్మారా చెల్లాచెదురయ్యాయని, పేలుడుకు గల కారణాలు తెలియదని ఆమె వివరించారు.