మే 1వ తేదీ నుంచి ఎలక్షన్ కమిషన్ చేపట్టనున్న ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ తన కార్యాలయంలో నియోజకవర్గ జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులతో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సర్వేపై కొన్ని అపోహలు ఉన్నందున కార్యకర్తలు, బూత్ ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలని, అధికారులు ఇంటింటికి వచ్చినప్పుడు సరైన సమాచారం అందించేలా సమన్వయం చేయాలని, నిజమైన ఓటర్లు ఎవరూ జాబితా నుంచి తొలగిపోకుండా తప్పనిసరిగా చూసుకోవాలని ఎమ్మెల్యే దిశానిర్దేశం చేశారు.