భర్త మరణంతో కుంగిపోయి మహిళ ఆత్మహత్య

1చూసినవారు
భర్త మరణంతో కుంగిపోయి మహిళ ఆత్మహత్య
సికింద్రాబాద్‌లోని మాణికేశ్వరీనగర్‌లో వరికుప్పల భారతి (48) అనే మహిళ బుధవారం ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఇటీవల భర్త లింగస్వామి మరణించడంతో, కూరగాయలు కట్ చేసే కూలీగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్న భారతి ఈ దారుణానికి పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు, ఘటనపై దర్యాప్తు చేపట్టారు.
Job Suitcase

Jobs near you