సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఓ మహిళ అదృశ్యం అయ్యింది. ఒడిస్సాకు చెందిన ప్రైవేటు ఉద్యోగి జాదునాత్ ముర్ము తన భార్య మల్లికా ముర్ము (26)తో కలిసి నగరానికి వచ్చేందుకు భువనేశ్వర్ రైల్వే స్టేషన్లో విశాఖ ఎక్స్ప్రెస్ బయలుదేరింది. ఈనెల 7న ఉదయం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ 5వ గేటు వద్ద కూర్చుని టూత్పెస్ట్ తెచ్చేందుకు బయటకు వెళ్లాడు. పది నిముషాల్లో తిరిగి వచ్చి చూడగా, తన భార్య అక్కడ కనిపించలేదు. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.