నగర వాసులకు అలర్ట్.. ఉప్పల్ రింగ్ రోడ్డు నేటి నుంచి బంద్

0చూసినవారు
నగర వాసులకు అలర్ట్.. ఉప్పల్ రింగ్ రోడ్డు నేటి నుంచి బంద్
హైదరాబాద్ నగర వాసులకు అలర్ట్. ఫ్లైఓవర్ పనుల నేపథ్యంలో ఉప్పల్ రింగ్ రోడ్డు నేటి నుంచి తాత్కాలికంగా మూసివేయబడుతుంది. హన్మకొండకు వెళ్లే బస్సుల కోసం నల్లచెరువు వద్ద బస్టాండ్ ఏర్పాటు చేశారు. బోడుప్పల్ వైపు నుంచి వచ్చే వాహనాలు భగాయత్ లే-అవుట్ ద్వారా నాగోల్ చేరుకోవాలి. వరంగల్ వైపు వెళ్లే వాహనాలు నాచారం ద్వారా చెంగిచర్లకి వెళ్లి, ఆపై హైవేకి చేరుకోవాలని అధికారులు సూచించారు.

సంబంధిత పోస్ట్