హోలీ పండుగ సందర్భంగా నగరంలో శాంతిభద్రతలను కాపాడేందుకు, ప్రజలు ప్రశాంతంగా పండుగ జరుపుకునేలా మల్కాజిగిరి CP అవినాష్ మహంతి కీలక ఆదేశాలు జారీ చేశారు. పోలీస్ కమిషనరేట్ పరిధిలోని అన్ని వైన్ షాపులు, రెస్టారెంట్లకు అనుబంధంగా ఉన్న బార్లను మంగళవారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పూర్తిగా మూసివేయాలని ఆదేశించారు. ఆదేశాలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ ఆదేశాలు హైదరాబాద్, ఉప్పల్, మేడ్చల్ ప్రాంతాలకు వర్తిస్తాయి.