హైదరాబాద్లో మరో భారీ సైబర్ మోసం వెలుగుచూసింది. ECIL ప్రశాంతినగర్కు చెందిన 62 ఏళ్ల వ్యాపారిని నీలం ధవన్ అనే యువతి స్టాక్ ట్రేడింగ్లో అధిక లాభాలంటూ నమ్మించింది. 'యాక్సిస్ సెక్యూరిటీ' పేరుతో నకిలీ యాప్ లింక్ పంపి, దశలవారీగా రూ.3.87 కోట్లు కాజేసింది. IPOల పేరుతో కూడా భారీగా వసూలు చేసినట్లు బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.