మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శ్రీ. వినయ్ కృష్ణా రెడ్డి నగరంలోని పారిశుద్ధ్యంపైనే ప్రధానంగా దృష్టి సారించినట్లు తెలిపారు. బుధవారం తార్నాకలోని ఎంఎంసి ప్రధాన కార్యాలయంలో ఉప్పల్ జోన్ పరిధిలోని శానిటేషన్ ఫీల్డ్ అసిస్టెంట్స్తో నిర్వహించిన ప్రత్యేక సమీక్షా సమావేశంలో, క్షేత్రస్థాయి సమస్యలు, అమలు చేయాల్సిన కీలక అంశాలపై చర్చించి, స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు.