హైదరాబాద్లోని హబ్సిగూడలో సైన్స్ సెంటర్ను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ ఈటల రాజేందర్తో కలిసి పరిశీలించారు. ఈ నేషనల్ సైన్స్ సెంటర్ హైదరాబాద్కు కీలక భూమిక పోషించనుంది. విద్యార్థుల పరిశోధనలకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని మంత్రి తెలిపారు. అనేక పరిశోధన సంస్థలతో పాటు, డిఫెన్స్ సంస్థలు పనిచేస్తున్న నేపథ్యంలో, ఈ సెంటర్ వాటి సరసన చేరనుంది. పనులను వేగవంతం చేయడానికి, పరిశీలించడానికి ఈ సందర్శన జరిగింది.