పెంచిన పెట్రోల్, డీజిల్, సీఎన్జీ, ఎల్పీజీ ధరలు తగ్గించకపోతే సీఎం రేవంత్ రెడ్డి ఇంటిని ముట్టడిస్తామని భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు వేముల మారయ్య హెచ్చరించారు. ధరల పెరుగుదల, గ్యాస్ కొరతను నిరసిస్తూ హైదరాబాద్ మల్లాపూర్ చౌరస్తాలో బీఆర్ఎస్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో రిక్షా తొక్కుతూ నిరసన తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని నిరసిస్తూ రవాణా కార్మికులు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపినట్లు వేముల మారయ్య తెలిపారు.